తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధిని చూసి ఓటేయండి: సురభి వాణీ దేవి - Brahmmana Parishad Spiritual Assembly

సంక్షేమ పథకాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెరాస పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీ దేవి అన్నారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని పట్టభద్రులను కోరారు. యువత సమస్యలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని ఆమె తెలిపారు.

Surabhi Vani Devi, MLC candidate for Teresa graduates, said the state was at the forefront of welfare schemes
అభివృద్ధిని చూసి ఓటేయండి: సురభి వాణీ దేవి

By

Published : Mar 1, 2021, 9:53 AM IST

రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ పట్టభద్రుల తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీ దేవి అన్నారు. హైదరాబాద్​లోని కొత్తపేటలో బ్రాహ్మణ పరిషత్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బ్రాహ్మణులు మద్దతు తెలపటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

పట్టభద్రులందరూ ఆలోచించి ఓటు వేయాలని వాణీ దేవి కోరారు. యువత సమస్యలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని తెలిపారు. పెద్దల సభకు పంపిస్తే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తానని ఆమె తెలిపారు.

ఇదీ చదవండి:కనుల పండువగా పెద్దగట్టు జాతర

ABOUT THE AUTHOR

...view details