తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​పై సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు - Supreme court latest updates

లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంపై దాఖలైన పిటిషన్​పై సుప్రీం విచారణ చేపట్టింది. సరైన అధ్యయనం లేకుండానే అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరిస్తున్నారంటూ.. జమ్మికుంట వాసి జువ్వాడి సాగర్​రావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

అక్రమ లే అవుట్లపై పిటిషన్... విచారణ చేపట్టిన సుప్రీం
అక్రమ లే అవుట్లపై పిటిషన్... విచారణ చేపట్టిన సుప్రీం

By

Published : Dec 16, 2020, 5:18 PM IST

Updated : Dec 16, 2020, 7:11 PM IST

లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంపై దాఖలైన పిటిషన్​ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సరైన అధ్యయనం లేకుండానే అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరిస్తున్నారంటూ.. జమ్మికుంట వాసి జువ్వాడి సాగర్​రావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఎల్​ఆర్​ఎస్ పథకం ద్వారా అక్రమాలకు పాల్పడిన స్థిరాస్తి వ్యాపారులను వదిలేసి ఇళ్లు, స్థలాలను కొన్న వారిని శిక్షిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. మహా నగరాల్లో వరదలకు అక్రమ లే అవుట్లే కారణమన్న పిటిషనర్.. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.

జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి ప్రతివాదులైన కేంద్రం, సీబీఐ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. 3 రాష్ట్రాలను ప్రతివాదులుగా చేసినందున దేశంలో మిగిలిన రాష్ట్రాల్లోనూ లే అవుట్ల క్రమబద్ధీకరణ తెలుసుకునేందుకు ఆయా రాష్ట్రాలను రెండు రోజుల్లో ఇంప్లీడ్ చేయాలని ధర్మాసనం.. పిటిషనర్​కు సూచించింది. ఇంప్లీడ్ చేసిన తర్వాత మిగిలిన రాష్ట్రాలకు కూడా నోటీసులు జారీ అవుతాయని... కేంద్రం, అన్ని రాష్ట్రాలు 8 వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

ఇదీ చూడండి:పోలీస్​శాఖలో 20వేల పోస్టులు భర్తీ చేస్తాం: హోంమంత్రి

Last Updated : Dec 16, 2020, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details