శ్రీవారి దర్శనార్థం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు తిరుమలకు రానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం చెన్నైకి చేరుకుని.. అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటారు. రాత్రి తిరుమల కొండపైనే బస చేసి.. శుక్రవారం ఉదయం సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొననున్నారు.
నేడు తిరుమలకు సుప్రీం కోర్టు సీజే.. పటిష్ఠ ఏర్పాట్లు చేసిన తితిదే - cji justice nv ramana on lord balaji darshan
నేడు భారత ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా తిరుమలకు రానున్నారు. శుక్రవారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు తితిదే అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.
![నేడు తిరుమలకు సుప్రీం కోర్టు సీజే.. పటిష్ఠ ఏర్పాట్లు చేసిన తితిదే cji justice nv ramana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12074702-1058-12074702-1623285643529.jpg)
తిరుమలకు సుప్రీం కోర్టు సీజే
ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సందర్భంగా ఏప్రిల్ 11న (శుక్రవారం) స్వామివారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సీజేఐ హోదాలో తిరుమలకు వెళ్లనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి.. తితిదేకు పర్యటన వివరాలు అందాయి. ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి.
ఇదీ చూడండి: హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరుగుదల!