తెలంగాణ

telangana

By

Published : Jul 5, 2020, 6:19 PM IST

ETV Bharat / state

శంషాబాద్​ ఎయిర్​పోర్టులో.. సుడాన్​ మహిళ మృతి

హైదరాబాద్​ శంషాబాద్​ విమానాశ్రయంలో సుడాన్​ దేశానికి చెందిన మహిళ మృతి చెందింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్​లో క్యాన్సర్​ చికిత్స తీసుకుని తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు ఎయిర్​పోర్టుకు చేరుకుంది. శంషాబాద్​ విమానాశ్రయంలో కుప్పకూలిపోయింది.

శంషాబాద్​ ఎయిర్​పోర్టులో.. సుడాన్​ మహిళ మృతి
Sudan Women Die In Shamshabad Airport

హైదరాబాద్​ విమానాశ్రయంలో 60 ఏళ్ల మహిళ మృతి చెందింది. సుడాన్​కు దేశానికి చెందిన మహ్మద్​ తాహ అలీ క్యాన్సర్​ వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం హైదరాబాద్ వచ్చింది. బంజారాహిల్స్​లోని విరించి ఆస్పత్రిలో చికిత్స పొందింది. తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకుంది. బార్డర్​ ఎయిర్​లైన్స్​ విమానం ఎక్కుతుండగా.. ఒక్కసారిగా కిందపడిపోయింది. వెంటనే విమానాశ్రయ సిబ్బంది, బంధువులు ఆమెను ఎయిర్​పోర్టులోని అపోలో ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

ABOUT THE AUTHOR

...view details