హైదరాబాద్ అరణ్య భవన్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తన్నీరు హరీశ్రావు, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పశు సంవర్ధక, మత్స్య రంగం, ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు ప్రతీ రోజు పాలు సరఫరా చేస్తున్నామని.. దూర ప్రాంతాలకు సరఫరా చేసే క్రమంలో పాలు పాడవుతున్నాయని మంత్రి తలసాని అన్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి విజయ డైయిరీ ద్వారా టెట్రా ప్యాక్ పాలు పంపేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇందుకు ఆర్థిక వనరులు సమకూర్చాలని మంత్రి హరీశ్రావును కోరారు.
'గోపాల మిత్ర వేతన బకాయిలు ఇప్పించండి'
4 నెలలుగా రావాల్సిన గోపాలమిత్ర వేతన బకాయిలు సహా... పాల సేకరణకు ప్రభుత్వం చెల్లిస్తున్న ప్రోత్సాహం కూడా విడుదల చేయాలని మంత్రి తలసాని ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్రావు... ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
'పశువులకు నట్టల మందులు కావాలి'
పశువులకు నట్టల మందులు తప్పకుండా వేయాలని... ఫలితంగా మేకలు, గొర్రెలు ఆరోగ్యంగా ఉంటూ బరువు పెరుగుతాయన్నారు. ఇందుకు తగిన నిధులు కావాలని తలసాని కోరగా... హరీశ్రావు ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు. పశువులకు సమయానికి నట్టల మందులు వేయాలని... ఇందుకు సహకరిస్తామని మంత్రి హారీశ్ హామీ ఇచ్చారు.