తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై అవగాహన కల్పించేలా ఆర్టీఏ పోస్టర్లు - తెలంగాణ ఆర్టీఏ

కరోనా వైరస్​పై రవాణా శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. అధికారులు వైరస్​పై అవగాహన కల్పించేలా పోస్టర్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాలతోపాటు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లపై పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్​ ఖైరతాబాద్​ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

కోరనాపై అవగాహన కల్పించేలా ఆర్టీఏ పోస్టర్లు
కోరనాపై అవగాహన కల్పించేలా ఆర్టీఏ పోస్టర్లు

By

Published : Mar 6, 2020, 5:10 AM IST

Updated : Mar 6, 2020, 7:25 AM IST

కోరనాపై అవగాహన కల్పించేలా ఆర్టీఏ పోస్టర్లు

ప్రపంచాన్ని కలవరపరుస్తున్న క‌రోనా వైరస్‌పై అప్రమ‌త్తమైన ర‌వాణా శాఖ ముంద‌స్తు చ‌ర్యలు చేప‌ట్టింది. ఆర్టీఏ కార్యాల‌యాల‌కు వివిధ ప‌నుల నిమిత్తం వచ్చే వాహ‌న‌దారులు వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఉండేందుకై అధికారులు అవ‌గాహ‌న క‌ల్పించేలా పోస్టర్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యాలయాలతో పాటు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లపై కరోనా వైర‌స్ జాగ్రత్తల‌పై పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు.

అవగాహనపై అధికారులకు దిశా నిర్దేశం:

ఈ అవ‌గాహ‌న పోస్టర్ల‌ను వివిధ వాహ‌నాల‌కు అతికిస్తూ వాహనదారులను చైతన్యపరిచే కార్యక్రమం హైదరాబాద్​ ఖైర‌తాబాద్ ఆర్టీఏ కార్యాల‌యంలో నిర్వహించారు. ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ ఎం.ఆర్‌.ఎం. రావు పాల్గొని క‌రోనా వైరస్ ప్రబ‌ల‌కుండా తీసుకుంటున్న చ‌ర్యల్ని వివ‌రించారు. కరోనా వైరస్ నియంత్రణకై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై, ప్రజలకు కల్పించాల్సిన అవగాహనపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని పోస్టర్లతో విస్తృతంగా అవగాహనను కల్పించాలని ఆదేశించారు.

పోస్టర్లతో ప్రచారం..

ఆర్టీఏ కార్యాల‌యాల‌కు వాహ‌న‌దారుల రాక‌పోక‌లు ఎక్కువ‌గా ఉన్నందున ముంద‌స్తు జాగ్రత్త చ‌ర్యలతో అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప‌బ్లిక్‌, ప్రైవేట్ ట్రావెల్స్, ద్విచ‌క్ర వాహనాలు, ఆటోలు, కార్లు, ఇతర వాహ‌నాల‌పై విస్తృతంగా పోస్టర్లతో ప్రచారం నిర్వహించ‌నున్నట్లు రావు తెలిపారు.

ఇవీ చూడండి:ప్రైవేటు ఆస్పత్రికి కరోనా సోకిన ఇటలీ పర్యటకులు

Last Updated : Mar 6, 2020, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details