తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర కాంగ్రెస్​ ఫిర్యాదు

దుబ్బాక ఉపఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించేందుకు తగినచర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్​ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. భాజపా, అధికార తెరాసలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాయని ఫిర్యాదు చేశారు.

By

Published : Oct 28, 2020, 5:18 AM IST

State Congress complaint to the Central Electoral Commission
కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర కాంగ్రెస్​ ఫిర్యాదు

కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాకి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లేఖ రాసింది. దుబ్బాక ఉపఎన్నిక పారదర్శకంగా జరిగేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అధికార దుర్వినియోగం, డబ్బు, మద్యం పంపిణీని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్​ మర్రి శశిధర్ రెడ్డిలతో కలిసి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోరాకు ఆయన మంగళవారం లేఖ రాశారు.

భాజపా అభ్యర్థి రఘనందన్​రావు బంధువుల వద్ద రెండు సార్లు డబ్బులు దొరికాయన్నారు. అధికార తెరాస కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని... డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు.

ఇవీ చూడండి: కేంద్ర బలగాలతో దుబ్బాక ఉప ఎన్నికలు నిర్వహించాలి: భాజపా

ABOUT THE AUTHOR

...view details