తెలంగాణ

telangana

పీసీసీ పీఠం కోసం రెండో రోజు ముగిసిన అభిప్రాయ సేకరణ

తెలంగాణ రాష్ట్ర పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండో రోజు కాంగ్రెస్‌ నేతల నుంచి అభిప్రాయ సేకరణ కార్యక్రమం ముగిసింది. గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌ నేతృత్వలో మొదలైన కార్యక్రమం రాత్రి 8.30 వరకు జరిగింది.

By

Published : Dec 10, 2020, 7:25 PM IST

Published : Dec 10, 2020, 7:25 PM IST

Updated : Dec 10, 2020, 10:09 PM IST

పీసీసీ పీఠం కోసం రెండో రోజు అభిప్రాయాల సేకరణ
పీసీసీ పీఠం కోసం రెండో రోజు అభిప్రాయాల సేకరణ

గాంధీభవన్‌లో రెండో రోజు కాంగ్రెస్‌ నేతల అభిప్రాయ సేకరణ ముగిసింది. గురువారం ఉదయం 11 గంటలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రారంభమైన అభిప్రాయ సేకరణ రాత్రి 8.30 గంటల వరకు కొనసాగింది. మాజీ మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, ఏఐసీసీ సభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షుల నుంచి నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌ అభిప్రాయాలను తెలుసుకున్నారు.

బుధవారం నుంచి గురువారం రాత్రి వరకు 65 మంది నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. శుక్రవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీగా పోటీ చేసిన వాళ్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుల నుంచి అభిప్రాయ సేకరిస్తారు.

ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డితో పాటు మర్రి శశిధర్‌ రెడ్డి.. తమకు అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. తమకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే 2023 నాటికి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని పలువురు నాయకులు ఇంఛార్జికి వివరించారు. ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు తమ అభిప్రాయలను తెలియచేయడం కోసం ప్రతి నాయకుడికి ఒక సమయం ఇచ్చి.. దాని ప్రకారం హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి:త్వరలో తెరాస కనుమరుగవుతుంది: విజయశాంతి

Last Updated : Dec 10, 2020, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details