తెలంగాణ

telangana

By

Published : May 25, 2020, 7:39 AM IST

ETV Bharat / state

కనిష్ఠ స్థాయికి శ్రీశైలం నీటిమట్టం

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీశైలం జలాశయం నీటిమట్టం కనిష్ఠ స్థాయికి చేరుతుండటం వల్ల... విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి అవసరాలకు వినియోగించే అవకాశం ఉంది.

srisailam-dam-water-level-raises-to-minimum
కనిష్ఠ స్థాయికి శ్రీశైలం నీటిమట్టం

శ్రీశైలం జలాశయం నీటిమట్టం కనిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. ఆదివారం జలాశయం నీటిమట్టం 811.90 అడుగులు, నీటి నిల్వ 35.4269 టీఎంసీలకు చేరింది. జలాశయంలో నీరు 28 టీఎంసీలకు చేరుకోగానే డెల్టా స్టోరేజీగా పరిగణిస్తారు. ఈ ప్రకారం ఇంకా 7 టీఎంసీల నీరు విద్యుద్ ఉత్పత్తి, తాగునీటి అవసరాలకు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. జూన్‌లో ప్రారంభం కానున్న వర్షాకాలంలో తెలుగు రాష్ట్రాల జలాశయాలకు ఆశించిన విధంగా నీరు వస్తుందని ఇంజినీర్లు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details