తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్​ నియంత్రణ మండలి ఛైర్మన్​గా శ్రీరంగారావు ప్రమాణం

రాష్ట్ర విద్యుత్​ నియంత్రణ మండలి ఛైర్మన్​గా శ్రీరంగారావు, ఆర్థిక సభ్యుడిగా బండారు కృష్ణయ్య, సాంకేతిక సభ్యుడిగా మనోహర్​రాజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రమాణం చేయించారు.

By

Published : Oct 30, 2019, 5:23 PM IST

విద్యుత్​ నియంత్రణ మండలి ఛైర్మన్​గా ప్రమాణం చేసిన శ్రీరంగారావు

విద్యుత్​ శాఖలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని రాష్ట్ర విద్యుత్​ నియంత్రణ మండలి ఛైర్మన్​గా ప్రమాణం చేసిన శ్రీరంగారావు అన్నారు. లకడీకపూల్​లోని ఫెడరేషన్​ హౌస్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి ఆయనతో ప్రమాణం చేయించారు. ఆర్థిక సభ్యుడుగా బండారు కృష్ణయ్య, సాంకేతిక సభ్యుడిగా మనోహర్​రాజు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్​ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్​ మిశ్రా హాజరయ్యారు. ప్రభుత్వం తనపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని శ్రీరంగారావు తెలిపారు.

విద్యుత్​ నియంత్రణ మండలి ఛైర్మన్​గా ప్రమాణం చేసిన శ్రీరంగారావు

ABOUT THE AUTHOR

...view details