తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2020, 12:34 AM IST

ETV Bharat / state

మర్కజ్ కేసుల కోసం ప్రత్యేక ప్రోటోకాల్

దిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మర్కజ్ కేసుల కోసం ప్రత్యేక ప్రోటోకాల్​ను ప్రభుత్వం రూపొందించింది.

special protocal for markaz corona cases
మర్కజ్ కేసుల కోసం ప్రత్యేక ప్రోటోకాల్

కరోనా పాజిటివ్ వచ్చిన మర్కజ్ కేసులన్నింటినీ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేక ప్రోటోకాల్​ను ప్రభుత్వం రూపొందించింది. గాంధీకి తరలించే క్రమంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

కరోనా నెగెటివ్ వచ్చిన వారందరినీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రభుత్వ క్వారంటైన్​లోనే ఉంచాలని స్పష్టం చేసింది. పరీక్షల ఫలితాలు రావాల్సిన వారందరినీ కూడా ప్రభుత్వ క్వారంటైన్​లోనే ఉంచాలని పేర్కొంది. నెగెటివ్ వచ్చిన, ఫలితాలు రావాల్సిన వారిని ఒకే రూమ్ లేదా హాల్​లో ఉంచరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి :రాష్ట్రంలో 154కు చేరిన కరోనా కేసుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details