హైదరాబాద్ తార్నాకలో సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ సన్నాహక సమావేశం జరిగింది. ఎన్నో ఏళ్లుగా దక్షిణాది రాష్ట్రాలకు విద్యా, వైద్య ,రాజకీయలతో పాటు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతోందని జేఏసీ ఛైర్మన్, ఓయూ ప్రొఫెసర్ గాలి వినోద్ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు కాపాడుకునేందుకు ద్రావిడ సేన ఆవిర్భవించినట్లు వెల్లడించారు.
'హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేయాలి'
దక్షిణ భారత ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీకి అనుబంధంగా హైదరాబాద్లో ద్రావిడ సేనను ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ గాలి వినోద్ వెల్లడించారు. భాగ్యనగరాన్ని దేశానికి రెండో రాజధానిగా ప్రకటించాలని కోరారు.
హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేయాలి
ఈ సందర్భంగా ఆయన నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. కన్వీనర్గా దున్నా అంబేడ్కర్, కో కన్వీనర్లుగా బి.అశోక్, వి.సురేశ్, గంగాధర్, భద్ర, కల్యాణ్, వీణా వాణీలను ఎన్నుకున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు బెంచ్ను చెన్నైలో ఏర్పాటు చేయాలని కోరారు.