తెలంగాణ

telangana

By

Published : Mar 7, 2020, 5:01 AM IST

Updated : Mar 7, 2020, 8:02 AM IST

ETV Bharat / state

కరోనాతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తం

కోవిడ్​-19 వైరస్​పై దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. జోనల్ కేంద్ర రైల్వే ఆసుపత్రితో పాటు, ఆరు డివిజన్ కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో కరోనా వైరస్ అనుమానితులకు ప్రత్యేక వార్డులను కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. ప్రధాన స్టేషన్లలో ప్రాంతీయ భాషలలో సూచిక బోర్డులు, అనౌన్స్​మెంట్ల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే నిత్యం ప్రయాణించే 745 రైళ్లను ప్రతిరోజు శుభ్రం చేస్తున్నామని పేర్కొన్నారు.

కరోనాతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తం
కరోనాతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తం

కరోనాపై దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. రోజుకు 10.50 లక్షల ప్రయాణికులు ద.మ. రైల్వేలో నిత్యం ప్రయాణం చేస్తుంటారు. రోజూ 745 రైళ్లు 6,400 కి.మీ పరిధిలో తిరుగుతుంటాయి. అందుకే ప్రయాణికుల సౌకర్యార్థం ద. మ. రైల్వే కరోనా నివారణ చర్యలు చేపట్టింది.

ప్రధాన స్టేషన్లలో సూచిక బోర్డులు..

జోనల్ కేంద్ర రైల్వే ఆసుపత్రితో పాటు, ఆరు డివిజన్ కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో కరోనా వైరస్ అనుమానితులకు ప్రత్యేక వార్డులను కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. ప్రధానమైన స్టేషన్లలో ప్రాంతీయ భాషలలో కరోనా వైరస్​కు సంబంధించిన సమాచారం, అనౌన్స్​మెంట్లు, సూచిక బోర్డుల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. జోన్, డివిజన్ రైల్వే పరిసర ప్రాంతాల్లో కరోనా అనుమానితులను పర్యవేక్షించే యంత్రాంగాన్ని వినియోగిస్తున్నామన్నారు.

ప్రతిరోజు శుభ్రం:

విధుల్లో ఉన్న రైల్వే మెడికల్ సిబ్బంది ఎప్పటికప్పుడు రాష్ట్ర, జిల్లా అధికారులతో సంప్రదింపులు జరుపుతూ తాజా పరిస్థితుల్లో మార్గదర్శనం కోసం సలహాలు తీసుకొని అవసరమైన పరిశోధన, నియంత్రణ, నివారణ చర్యలు చేపడతామని గజానన్​ మాల్యా వివరించారు. కరోనా అనుమానితులకు సహాయం కోసం శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక చేశామన్నారు. ఇందుకోసం శుక్రవారం రైల్వే వైద్యులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రైల్వే బోర్డ్ సహకారంతో వీడియో లింకేజ్ ద్వారా శిక్షణ ఏర్పాటు చేశామని తెలిపారు. 745 రైళ్లను ఇప్పటికే ప్రతిరోజు శుభ్రం చేస్తున్నామని.. రైల్వే స్టేషన్లు, రైళ్లను ఎప్పటికప్పుడు మరింత శుభ్రం చేయాలని నిర్ణయించమన్నారు.

కరోనాతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తం

ఇవీ చూడండి:అసెంబ్లీలో నమస్కారం 'కరో'నా అంటున్న నేతలు

Last Updated : Mar 7, 2020, 8:02 AM IST

ABOUT THE AUTHOR

...view details