ఏపీ విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరలో భాగంగా ప్రధాన ఘట్టమైన సిరిమాను చెట్టును గుర్తించి, చెట్టువద్ద ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సిరిమాను అధిరోహించే పూజారికి అమ్మవారు స్వప్నంలో రావటం వల్ల ఏటా పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా జామి మండలం బలరాంపురంలో సిరిమాను చెట్టుని గుర్తించి, పూజారులు చెట్టుకు బొట్టు పెట్టి విశేష పూజలు జరిపారు. అనంతరం జిల్లా కేంద్రానికి తరిలించేందుకు ఈనెల 12వ తేదీన ముహూర్తం ఖరారు చేసినట్లు ఆలయ పూజారి వివరించారు.