తెలంగాణ

telangana

By

Published : Jul 22, 2020, 1:54 PM IST

ETV Bharat / state

కరోనా కట్టడికై సింగరేణి ప్రత్యేక ఏర్పాట్లు

సింగరేణిలో కరోనా తీవ్రత పెరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. సీఈఆర్ క్లబ్బులు, కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలల భవనాలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. అలాగే అత్యవసర చికిత్సల కోసం హైదరాబాద్​లో 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంది. కరోనా సోకిన వారికి ప్రత్యేక సెలవులు ఇవ్వాలని నిర్ణయించిన సింగరేణి... రెండు నెలల పాటు కార్మిక సంఘాలు సమావేశాలకు కూడా హాజరుకావాల్సిన అవసరం లేదని తెలిపింది.

singareni special arrangements for corona patients
కరోనా కట్టడికై సింగరేణి ప్రత్యేక ఏర్పాట్లు

సింగరేణిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. సంస్థ యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని కంపెనీ ఆసుపత్రుల్లో ఐసీయూ సదుపాయంతో ప్రత్యేక కరోనా వార్డులు సిద్ధం చేయాలని నిర్ణయించింది. సీఈఆర్ క్లబ్బులు, కమ్యూనిటీ హాళ్లు, పాఠశాల భవనాలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించినట్టు సింగరేణి డైరెక్టర్ చంద్ర శేఖర్ తెలిపారు. ప్రతీ క్వారంటైన్‌ కేంద్రంలో 24 గంటలు ఒక డాక్టరు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు.. హైదరాబాద్​లోని 3 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు పేర్కొన్నారు.

కరోనా చికిత్స కోసం ఖరీదైన యాంటీ వైరల్ డ్రగ్స్ తెప్పిస్తున్నట్టు డైరెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. సింగరేణిలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి.. రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే ప్రతీ నెల వారి బేసిక్‌ జీతంపై 10 శాతం ప్రత్యేక ప్రొత్సాహక అలవెన్సు చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కరోనా సేవల్లో పని చేస్తున్న వారందరికీ 50 లక్షల రూపాయల బీమా కోవిడ్‌ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏదైనా గనిలో కేసులు పెరిగితే.. కొన్నాళ్ల పాటు గనిని మూసి వేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

కరోనా తీవ్రత దృష్ట్యా 2 నెలల పాటు కార్మిక సంఘం గేట్ మీటింగ్​లు, ఇతర సమావేశాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కరోనా సోకిన వారికి ప్రత్యేక క్వారంటైన్‌ సెలవులను యాజమాన్యం మంజూరు చేస్తుందని వెల్లడించారు. యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటున్నందున కార్మికులు, ఉద్యోగులు ఆందోళన పడొద్దని... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details