సచివాలయ కార్యాలయాల తరలింపు ప్రక్రియ ఊపందుకుంది. సాధారణ పరిపాలనాశాఖ, ఇంధన, రెవెన్యూ తదితర శాఖల కార్యాలయాల్లోని దస్త్రాలు, ఫర్నీచర్, ఇతర సామగ్రిని బీఆర్కే భవన్కు తరలిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కార్యాలయంతో పాటు ఇతర శాఖల కార్యాలయాల తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు పూర్తైనా నిన్న నవమి కావడం వల్ల తరలించలేదు.
మంత్రుల కార్యాలయాలు ఇక్కడే!
శ్రావణ శుక్రవారాన్ని శుభదినంగా భావించి మెజార్టీ శాఖల కార్యాలయాలను నేడు తరలించనున్నారు. వీలైనంత వరకు ఇవాళ్టి నుంచే బీఆర్కే భవన్ నుంచి కార్యకలాపాలు నిర్వహించాలని సీఎస్ సహా అధికారులు భావిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కార్యాలయాన్ని బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయానికి తరలించనున్నారు. మిగతా మంత్రుల కార్యాలయాలను బీఆర్కే భవన్కు తరలించనున్నారు. అయితే శాఖాధిపతుల కార్యాలయాలకు వెళ్లేందుకే ఎక్కువ మంది మంత్రులు మొగ్గు చూపుతున్నారు.
సీఎం కార్యాలయం@ మెట్రో రైల్ భవన్