రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా 1990 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా మొన్నటి వరకు ఉన్న రజత్ కుమార్ ఇటీవల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు.
తెలంగాణ నూతన ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్ గోయల్ - election commission
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ నియమితులయ్యారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా కొనసాగిన రజత్ కుమార్ ఇటీవల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ నేపథ్యంలో కొత్త నియామకం జరిగింది.
![తెలంగాణ నూతన ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్ గోయల్ shashank](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6322524-578-6322524-1583516412069.jpg)
shashank
ఆయన స్థానంలో సీఈఓగా నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఆ జాబితాను పరిశీలించిన ఈసీ శశాంక్ గోయల్ను సీఈఓగా ఎంపిక చేసింది. ఆయన ప్రస్తుతం కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇదీ చూడండి :'కేటీఆర్పై జీవో ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి'
TAGGED:
ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్