పవిత్ర రంజాన్ మాసంలో లబ్ధిదారులకు ఉపయోగపడుతాయనే ఉద్దేశంతో షాదీముబారక్ చెక్కులను వేగంగా అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలో 2020-21 ఏడాదికి అర్హులైన 290మంది లబ్ధిదారుల కోసం రూ.2,90,33,600 నిధులు మంజూరు అయ్యాయని వివరించారు.
రంజాన్ వేళ.. షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ - తెలంగాణ వార్తలు
రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను త్వరగా అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ తెలిపారు. అర్హులైన 290 మందికి చెక్కులను అందజేశారు. పర్వదినం వేళ కుటుంబ అవసరాల కోసం ఉపయోగపడతాయని చెప్పారు.
షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, నాంపల్లి ఎమ్మెల్యే
ఆసీఫ్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను మంగళవారం అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని రంజాన్ మాసంలో కుటుంబ అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:పెళ్లి వేడుకలో కలెక్టర్ హల్చల్