తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఐటీ పార్కుల పేరిట.. సన్నిహితులకు అప్పగించే ప్రయత్నం' - ఐటీ పార్కుల మార్గదర్శాకాలు విమర్శించిన షబ్బీర్​ అలీ

హైదరాబాద్ పరిసరాల్లోని 11 పారిశ్రామిక పార్కుల ప్రధాన భూములను... ఐటీ పార్కుల పేరిట ప్రైవేటు కంపెనీలకు అమ్మాలని తెరాస ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్​ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆ భూములను మంత్రి కేటీఆర్​ సన్నిహితులకు అప్పగించే ప్రయత్నమేనని ఆయన విమర్శించారు.

shabbir ali comments on ts it parks Attempt to hand over to close associates in the name of ktr
'ఐటీ పార్కుల పేరిట సన్నిహితులకు అప్పగించే ప్రయత్నం'

By

Published : Dec 12, 2020, 3:34 AM IST

డిసెంబర్ 10న విడుదల చేసిన జీఓ ఓఆర్​ఆర్​లోని 11 పారిశ్రామిక పార్కులను ఐటీ పార్కులుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్​ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ఆ పారిశ్రామిక ఉద్యానవనాల్లో ఉన్న యూనిట్లు, వారి భూముల ఉద్యోగుల సంఖ్యపై ప్రత్యక్ష, పరోక్ష ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం జారీ చేయాలని డిమాండ్ చేశారు.

వాటిలో కూకట్ పల్లి, గాంధీనగర్, బాలానగర్, ఉప్పల్, నాచరం, మల్లాపూర్, మౌలాలీ, పఠాన్ చెరు, రామచంద్రపురం, సనత్‌నగర్, కటేడాన్ వద్ద ఉన్న పారిశ్రామిక పార్కులు ఉన్నాయని షబ్బీర్‌ అన్నారు. పారిశ్రామిక పార్కు ప్రధాన భూమిని ఐటి మంత్రి కె.తారాకరామారావు స్నేహితులకు అప్పగించే ప్రయత్నమేనని ఆయన ఆరోపించారు.

ఈ పారిశ్రామిక ఉద్యానవనాల్లో అనేక దశాబ్దాల నుంచి వేలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పనిచేస్తున్నాయని షబ్బీర్ అలీ తెలిపారు. కొవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక లేని చాలా యూనిట్లు తాత్కాలికంగా మూసివేయబడ్డాయని అన్నారు. ఆ పరిశ్రమలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకునే బదులు, తెరాస ప్రభుత్వం ఆ పరిశ్రమలను శాశ్వతంగా మూసివేయాలని కోరుకుంటుందన్నారు.

ఇదీ చూడండి :పీసీసీ కొత్త బాస్​ కోసం మూడో రోజూ అభిప్రాయసేకరణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details