హైదరాబాద్ ఖైరతాబాద్కు చెందిన అభ్యాస్ ఏడో తరగతి విద్యార్థి. కరోనా నియంత్రణపై వినూత్న శైలిలో అవగాహన కల్పించాడు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మాదిరిగా లాక్డౌన్లో పాటించాల్సిన నిబంధనలను వివరించాడు.
దేశ రాజధానిలో కరోనా పరిస్థితులు... అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించాడు. ప్రజలందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని అభ్యాస్ కోరాడు. భోజనానికి ముందు చేతులు కడుక్కోవాలని సూచించాడు.