తెలంగాణ

telangana

ETV Bharat / state

బీఆర్కే భవన్​లో సచివాలయ కార్యకలాపాలు షురూ

ఈరోజు నుంచి బూర్గుల రామకృష్ణారావు భవన్​లో సచివాలయ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. బీఆర్కే భవన్​లో తనకు ఏర్పాటు చేసిన  తన ఛాంబర్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి పనులు ప్రారంభించారు. పోలీసులు ట్రాఫిక్​ను పూర్తిస్థాయిలో గమనిస్తున్నారు.

By

Published : Aug 13, 2019, 1:20 PM IST

Updated : Aug 13, 2019, 2:38 PM IST

బీఆర్కే భవన్​లో ప్రారంభమైన సచివాలయ కార్యకలాపాలు

బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచి సచివాలయ కార్యకలాపాలు షురూ అయ్యాయి. కార్యాలయాల తరలింపు పూర్తై కార్యదర్శులు ఇక్కడినుంచే తమ కార్యకలాపాలను ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈ ఉదయం బీఆర్కే భవన్​కు వచ్చి తన ఛాంబర్​ను పరిశీలించి కాసేపు అక్కడే ఉండి కుందన్​బాగ్​లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి అదర్ సిన్హా, వైద్య ఆరోగ్య శాఖా కార్యదర్శి శాంతికుమారి తదితరులు బీఆర్కే భవన్​లోని తమ ఛాంబర్లకు వచ్చారు. పేషీలు ఇంకా పూర్తి స్థాయిలో తరలింపు పూర్తి కాకపోవడంతో కొంత మంది ఉద్యోగులు సచివాలయం నుంచే పని చేయనున్నారు. తరలింపు ప్రక్రియ ఇంకా కూడా కొనసాగుతోంది. మరోవైపు బీఆర్కే భవన్​లో మరమ్మతులు జరుగుతున్నాయి. ఇక్కడ పోలీసులు ట్రాఫిక్​ను పరిశీలించి వాహనాల రద్దీ, పార్కింగ్ తదితర విషయాలను గమనించారు. సచివాలయ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాక... పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.

బీఆర్కే భవన్​లో ప్రారంభమైన సచివాలయ కార్యకలాపాలు
Last Updated : Aug 13, 2019, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details