గ్రేటర్ పోలింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు వెబ్క్యాస్టింగ్ ద్వారా పరిశీలిస్తోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థ సారధి తెలిపారు. మొత్తం 2 వేల 272 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మరో 15 వందలకుపైగా కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించామని వెల్లడించారు. ఈ ఎన్నికలు చాలా ప్రధానమని.. ఓటర్లు ఓటు వజ్రాయుధాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు.
భౌతిక దూరాన్ని పాటించేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిన వాళ్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు.