ఎన్నికలు ఎప్పుడైనా... సిద్దంగా ఉండాలి: జస్టిస్ కనగరాజ్
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలకు అంతా సన్నద్ధంగా ఉండాలని నూతన ఎస్ఈసీ జస్టిస్ కనగరాజ్ స్పష్టం చేశారు. సమన్వయం చేసుకుంటూ విధుల్లో భాగస్వామ్యం కావాలని సిబ్బందికి సూచించారు.
ఎన్నికలు ఎప్పుడైనా... సిద్దంగా ఉండాలి: జస్టిస్ కనగరాజ్
లాక్డౌన్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కుదుటపడ్డాక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందని ఎస్ఈసీ జస్టిస్ కనగరాజ్ అభిప్రాయపడ్డారు. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. సమయానికి అనుగుణంగా కార్యాచరణ, ప్రణాళికలు ఉండాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో కోడ్ కీలక భూమిక పోషిస్తుందన్న జస్టిస్ కనగరాజ్... స్థానిక ఎన్నికల వాయిదా, ఇతర అంశాలపై తొలిసారి సమీక్ష జరిపారు.