తెలంగాణ

telangana

ETV Bharat / state

'రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి' - కరోనాపై వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించిన సీఎండీ శ్రీధర్

సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో తాత్కాలిక ప్రాతిపదికపై మరో 21 మంది విశ్రాంత వైద్యులను నియమించనున్నట్లు సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సేవల కోసం ఇప్పటికే సుమారు 8 కోట్ల రూపాయల విలువైన మందులు, కిట్లు, ఇతర పరికరాలను కొనుగోలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

sccl cmd sridhar said be more vigilant in the days to come
'రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి'

By

Published : Aug 25, 2020, 3:38 AM IST

సింగరేణిలో కరోనా పరిస్థితులపై కొత్తగూడెంలోని డైరెక్టర్లు, వైద్య సిబ్బందితో సంస్థ సీఎండీ శ్రీధర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం సింగరేణి ఆస్పత్రుల్లో 643 కరోనా పడకలు ఉండగా.. మరో 600 బెడ్​లను సిద్ధం చేయాలని ఆదేశించారు.

సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 వేల 583 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2వేల 384 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు వివరించారు. వారిలో 808 మంది కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారని, మిగిలిన 226 మంది కంపెనీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మరో 1208 మంది సింగరేణి క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారని.. మరో 83 మంది హైదరాబాద్​లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. కరోనా పరీక్షలు మరింత పెంచాలని సీఎండీ స్పష్టం చేశారు. రానున్న కాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కార్మికులకు సూచించారు.

ఇదీ చూడండి :'వైద్య సిబ్బంది పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది'

ABOUT THE AUTHOR

...view details