రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమానికి కేటాయించిన ప్రత్యేక అభివృద్ధి నిధులను సకాలంలో ఖర్చు చేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్లో జరిగిన ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
కేటాయించిన నిధులు, ఖర్చుల వివరాలను అధికారుల్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు. సాధారణ బడ్జెట్ ఖర్చుతో పోల్చితే కొన్ని విభాగాల్లో ఖర్చు తక్కువగా ఉందని... ఈ నెలాఖరు నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధికి సంబంధించి ఈ ఏడాదికి రూ.10 వేల కోట్లు ఖర్చు అయ్యాయి.