సావిత్రిబాయి పూలే 189వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు అంజి యాదవ్ డిమాండ్ చేశారు. పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మెరుగైన సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని అంజియాదవ్ సూచించారు.
ఓయూలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. పూలే ఆశయాలను నిజం చేసేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.
SAVITRI BHAI PULE 189 BIRTH ANNIVERSARY CELEBRATIONS AT OU CAMPUS