హైదరాబాద్ మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి సన్మానం చేశారు. తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ మహమ్ముద్ నజీబ్... వైద్యులను పూలతో సత్కరించారు.
సరోజినీదేవి వైద్యులు, సిబ్బందికి పువ్వులతో సన్మానం
ప్రస్తుత పరిస్థితుల్లో డాక్టర్లు చేస్తున్న సేవను అభినందిస్తూ... హైదరాబాద్ సరోజినిదేవి వైద్యులు, వైద్య సిబ్బందిని తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ సన్మానించారు. కరోనాను తరిమికొట్టేందుకు కృషి చేస్తోన్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
సరోజినీదేవి వైద్యులు, సిబ్బందికి పువ్వులతో సన్మానం
ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులు చేస్తున్న సేవ ఎంతో విలువైనదని కొనియాడారు. కరోనా కట్టడి కోసం కృషిచేస్తోన్న వైద్యులందరికీ తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ తరఫున నజీబ్ కృతజ్ఞతలు తెలిపారు.