ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రిగా శంకరనారాయణ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఉదయం 10 గంటలకు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 11 గంటలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా వేణుగోపాల్ బాధ్యతలు చేపట్టారు.
కొత్త మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్లు ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. వారికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మంత్రి శంకరనారాయణ శాఖను మార్చింది. చెల్లుబోయిన వేణుగోపాల్కు బీసీ సంక్షేమశాఖను కేటాయించారు. సీదిరి అప్పలరాజుకు పశుసంవర్ధక, మత్స్యశాఖలు అప్పగించారు. ఇక బీసీ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న మాలగుండ్ల శంకరనారాయణకు రహదారులు, భవనాల శాఖను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.