తెలంగాణ

telangana

మాజీ డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో శానిటైజేషన్

By

Published : Apr 28, 2021, 9:13 PM IST

తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. పలు ప్రాంతాల్లో శానిటైజేషన్ చేయించారు.

sanitation in borabanda
sanitation in borabanda

తెరాస ప్రభుత్వం.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందని జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పేర్కొన్నారు. తెరాస 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

బోరబండ, మోతీనగర్​లోని పలు రద్దీ ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు ఫసియుద్దీన్. ప్రజలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:'మినీ పోల్స్​కు కొవిడ్ నిబంధనలకు లోబడి పకడ్బందీ ఏర్పాట్లు'

ABOUT THE AUTHOR

...view details