తెలంగాణ

telangana

పేద బ్రాహ్మణులకు సనాతన ఎంటర్ ప్రీమియస్ నిత్యావసరాల అందజేత

లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్​లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, పూజారులకు సనాతన ఎంటర్ ప్రీమియస్ అండగా నిలిచింది. 50 మంది పేద బ్రాహ్మణులకు ఉచితంగా నిత్యవసర సరకులను అందజేశారు.

By

Published : Jun 9, 2021, 1:58 PM IST

Published : Jun 9, 2021, 1:58 PM IST

 Sanathana enter premium necessities to poor Brahmins
Sanathana enter premium necessities to poor Brahmins

లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు పూజారులకు సనాతన ఎంటర్ ప్రీమియస్ చేయూత అందించింది. సికింద్రాబాద్ అల్వాల్​లోని బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య సభ్యురాలు జ్యోతి ఆధ్వర్యంలో దాదాపు 50 మంది పేద బ్రాహ్మణులకు ఉచితంగా నిత్యవసర సరకులను అందజేశారు.

బొల్లారంలోని సాయిబాబా దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా పూజలు అర్చనలు, లేక దేవాలయాలు వెలవెలబోయిన పరిస్థితి నెలకొందని వారు అన్నారు. పేద బ్రాహ్మణులు ఆకలితో అలమటించ వద్దనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శారదా, సుజాత, పద్మజ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: దారుణం: ఆసుపత్రి ఆరుబయటే మహిళ ప్రసవం

ABOUT THE AUTHOR

...view details