తెలంగాణ

telangana

ETV Bharat / state

భీమవరం బాలికకు సాహస పురస్కారం - భీమవరం బాలికకు సాహస బాలలు-2020 అవార్డు న్యూస్

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన పోతప్రగడ బాలసాయిశ్రీ సాహితీ వినూత్న.. సాహస బాలలు-2020 పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఛైల్డ్‌ వెల్ఫేర్‌ నుంచి ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం అందినట్లు ఆమె తండ్రి రమేష్‌ స్పష్టం చేశారు.

sahasa-balika-award-to-bhimavaram-girl
భీమవరం బాలికకు సాహస పురస్కారం

By

Published : Feb 17, 2021, 1:20 PM IST

ఏపీలోని భీమవరం పట్టణానికి చెందిన పోతప్రగడ బాలసాయిశ్రీ సాహితీ వినూత్నకు సాహస బాలలు-2020 పురస్కారం దక్కింది. వినూత్న ప్రస్తుతం ఇంటర్‌ చదువుతుంది. ఎన్‌సీసీ క్యాడెట్‌ అయిన వినూత్న గతేడాది భీమవరం డీఎన్నార్‌ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో జిల్లా స్థాయిలో విజేతగా నిలిచారు. బహుమతుల ప్రదానోత్సవాన్ని 2020 జనవరి 25న ఏలూరులో నిర్వహించారు.

కార్యక్రమం అనంతరం ఆర్టీసీ బస్సులో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఆమె స్వస్థలానికి బయలుదేరారు. ఆ బస్సు కృష్ణా జిల్లా కైకలూరు సమీపాన ఆలపాడు వద్ద ప్రమాదానికి గురై పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఆ సమయంలో 42 మంది బస్సులో ఉన్నారు. విపత్కర పరిస్థితుల్లో వినూత్న బస్సు కిటికీ అద్దాలను పగులగొట్టి తన స్నేహితురాలు, ఒక ఉపాధ్యాయిని, మరో ముగ్గురు వృద్ధులను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఈమె ధైర్య సాహసాలను గుర్తించిన పాఠశాల ప్రధానోపాధ్యాయిని నిర్మలాదేవి సాహసబాలల అవార్డు కోసం ప్రతిపాదనలు పంపారు.

ఇదీ చదవండి:కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి: మోదీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details