రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 3-వి సేఫ్ టన్నెల్ను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రారంభించారు. ఎస్-3వి వాస్కులార్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కమిషనరేట్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు.
'ఈ టన్నెల్ వైరస్ నుంచి రక్షణ కల్పిస్తోంది' - రాచకొండ పోలీస్ కమిషనరేట్
అరిసోల్ టెక్నాలజీతో రూపొందించిన 3-వి సేఫ్ టన్నెల్ను రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. కొన్ని వైరస్ల నుంచి ఇది మనుషులకు రక్షణ కల్పిస్తోందని వెల్లడించారు.
!['ఈ టన్నెల్ వైరస్ నుంచి రక్షణ కల్పిస్తోంది' safe tunnel at rachakonda police commissionerate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6710018-thumbnail-3x2-tunnel.jpg)
'ఈ టన్నెల్ వైరస్ నుంచి రక్షణ కల్పిస్తోంది'
అరిసోల్ టెక్నాలజీతో పనిచేసే ఈ టన్నెల్... కేవలం 20 సెకండ్లలో దీని నుంచి దాటే ప్రతీ మనిషికి వైరస్ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందని అధికారులు తెలిపారు.
'ఈ టన్నెల్ వైరస్ నుంచి రక్షణ కల్పిస్తోంది'
ఇవీ చూడండి:కరోనా పంజా: 12 గంటల్లో 25 మంది మృతి