రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. కొత్తూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం షాద్నగర్లో టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
అక్కడి నుంచి జిల్లేడు చౌదరగూడ మండలం జిల్లేడులో ప్రభుత్వ పాఠశాలలో ఎన్ఆర్ఐ దాత పొట్టి శ్రీనివాస్ తన తండ్రి జ్ఞాపకార్థం రూ.18 లక్షలతో నిర్మించిన రెండు తరగతి గదులు, వంట గదిని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతను ఆమె అభినందించారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.