తెలంగాణ

telangana

ETV Bharat / state

'యూనియన్లు పెట్టుకునే హక్కు ప్రతి కార్మికునికి ఉంది'

యూనియన్లు పెట్టుకునే హక్కు ప్రతి కార్మికునికి ఉందని కలెక్టరేట్​ ముట్టడిలో భాగంగా నాంపల్లి కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న వీహెచ్ అన్నారు. అనంతరం జేఏసీ నేతలు కలెక్టర్ మానిక్​రాజ్​కు వినతిపత్రాన్ని అందజేశారు.

By

Published : Oct 28, 2019, 1:47 PM IST

Updated : Oct 28, 2019, 7:45 PM IST

నాంపల్లి కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ కార్మికుల మహాధర్నా

యూనియన్లు పెట్టుకునే హక్కు ప్రతి కార్మికునికి ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ.హనుమంతరావు పేర్కొన్నారు.కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా హైదరాబాద్ నాంపల్లి కలెక్టరేట్‌ ముందు వామపక్ష నేతలు, కార్మికులతో కలిసి వీహెచ్ మహాధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ మానిక్​రాజ్​కు జేఏసీ నేతలు వినతి పత్రం అందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునేందుకే ప్రభుత్వం కార్మికులను రోడ్డుమీదకు తీసుకొచ్చిందని వీహెచ్ విమర్శించారు. పండుగలు జరుపుకోనివ్వకుండా ఆర్టీసీ కార్మికులను, కుటుంబాలను సీఎం కష్టపెడుతున్నారని వీహెచ్ అన్నారు.

నాంపల్లి కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ కార్మికుల మహాధర్నా
Last Updated : Oct 28, 2019, 7:45 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details