తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2021, 7:23 PM IST

ETV Bharat / state

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి : ఈయూ

ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని ఉద్యోగుల సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్​లోని కార్మికశాఖ కమిషనర్​ కార్యాలయం ముందు నినాదాలు చేశారు.

rtc employees union dharna at labour commissioner office in hyderabad
కార్మికశాఖ కార్యాలయం ముందు ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకుల ఆందోళన

హైదరాబాద్​లోని కార్మికశాఖ కమిషనర్​ కార్యాలయం ముందు ఆర్టీసీ ఎంప్లాయిస్​ యూనియన్​ ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ట్రేడ్​ యూనియన్ చట్టాలను అమలు చేయాలని కమిషనర్​కు విజ్ఞప్తి చేశారు.

అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం డ్యూటీల విధానం ఉండాలని కమిషనర్​ను కోరారు. ఇప్పటిదాకా వేతన సవరణ చేయకపోవడాన్ని కార్మిక నేతలు తప్పుబట్టారు. ఎన్నికలు నిర్వహించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి హెచ్చరించారు.

ఇదీ చూడండి :నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడి

ABOUT THE AUTHOR

...view details