తెలంగాణ

telangana

ETV Bharat / state

హెచ్​ఎండీఏ మైదానంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు - హెచ్​ఎండీఏ మైదానంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు

రోడ్డు ప్రమాదాల‌ను నివారించ‌డానికి భద్రతా నిబంధ‌న‌ల్ని ఆచ‌రించ‌డమే కాకుండా.. వాహ‌నాల‌ను న‌డిపేట‌ప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ అన్నారు. ర‌వాణా శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవ‌రి 2 వ‌ర‌కు నిర్వహించే రోడ్డు భద్రత వారోత్సవాలను ఆయన ప్రారంభించారు.

road safety week launching celebrations at hmda ground
హెచ్​ఎండీఏ మైదానంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు

By

Published : Jan 28, 2020, 7:25 AM IST


హైదరాబాద్​లోని హెచ్​ఎండీఏ మైదానంలో రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ప్రారంభించారు. వాహనాలు, జనాభాతో పాటు వాహనాల సంఖ్య పెరగడం... భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్​... కారు ఇతర వాహనాలు నడిపేటప్పుడు సీట్​బెల్ట్​ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. చైతన్య కార్యక్రమాల్లో భాగంగా ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎస్​ సోమేశ్​​కుమార్​, సినీనటి ఈషారెబ్బ పాల్గొన్నారు.

హెచ్​ఎండీఏ మైదానంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు

ఇదీ చూడండి: కరోనా వైరస్​ పట్ల అప్రమత్తంగా రాష్ట్ర ప్రభుత్వం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details