తెలంగాణ

telangana

By

Published : May 22, 2020, 8:54 AM IST

ETV Bharat / state

డివైడర్​ను ఢీకొట్టి కారు బోల్తా

హైదరాబాద్​ మెహిదీపట్నం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో దూసుకెళ్లిన కారు... డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

road-accident-at-mehdipatnam-hyderabad
డివైడర్​ను ఢీకొట్టి కారు బోల్తా

హైదరాబాద్​ ఆసిఫ్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో మెహిదీపట్నం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ స్విఫ్ట్​ కారు పిల్లర్​ నంబర్​ 35 వద్ద ఓ డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలోఈ ఘటన జరిగింది.

కారులో ప్రయాణిస్తున్న కొల్లూరు గ్రామానికి చెందిన సాయిరోహిత్​(22) తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని వెంటనే చికిత్స కోసం దగ్గరలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు​లో లిక్కర్ బాటిల్స్​ ఉండటంతో మద్యం మత్తులోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక

ABOUT THE AUTHOR

...view details