తెలంగాణ

telangana

By

Published : May 30, 2021, 4:41 PM IST

ETV Bharat / state

Lockdown: ఉపాధి కోల్పోయిన బెస్తలకు బియ్యం, మాస్కుల పంపిణీ

లాక్​డౌన్​తో చేపల విక్రయాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గంగపుత్రులకు ఆదిత్య శ్రీ కృష్ణ ఛారిటబుల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. హైదరాబాద్​ మాచిపురలో ఈ కార్యక్రమం చేపట్టారు.

rice and masks distribution to ganga putrulu
బెస్తలకు బియ్యం, మాస్కుల పంపిణీ

లాక్​డౌన్​ దృష్ట్యా పనులు లేక, చేపల విక్రయాలు లేక ఆకలితో అలమటిస్తున్న 350 మంది గంగ పుత్రులకు 10 కిలోల బియ్యం, ఎన్ 95 మాస్కులను ఆదిత్య శ్రీకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ట్రస్ట్​ ఛైర్మన్, తెరాస రాష్ట్ర నాయకులు నందు కిషోర్ వ్యాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో చేపట్టారు. హైదరాబాద్​ మాచిపురలోని జలక్ క్షత్రియ భవన్​లో గంగపుత్రులకు అందించారు.

లాక్​డౌన్​తో చేపల వ్యాపారాలు లేక ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న తమకు నందకిషోర్ సహాయం అందించడంపై గంగపుత్ర సంఘం అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ కొనసాగే వరకు తమ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తామని నంద కిషోర్​ తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పరేటర్​ పరమేశ్వరి సింగ్​ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Kishan Reddy:'మోదీ ప్రభుత్వం కరోనాను సమర్థంగా ఎదుర్కొంది'

ABOUT THE AUTHOR

...view details