Cheguvera daughter, grand daughter Coming Vijayawada: ఈనెల 23న విజయవాడలో నిర్వహించనున్న క్యూబా సంఘీభావ సభకు లాటిన్ అమెరికా విప్లవ యోధుడు చేగువేరా కుమార్తె డా. అలైదా గువేరా, మనమరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా రానున్నారు. భారతదేశ పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేస్తున్నారని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారి పర్యటనకు సంబంధిచిన పోస్టర్ను నేడు ఆవిష్కరించారు.
అమెరికా అంతర్జాతీయంగా ఎదుగుతున్న దేశాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎదగనివ్వకుండా చేస్తుందని హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అమెరికా క్యుబాపై చేసిన దాడులను, క్యూబా నిర్బంధించిన విధానానికి వ్యతిరేకంగా సంఘీభావ సభ నిర్వహిస్తారని వివరించారు. ఈ సంఘీభావ సభ 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఎంబీవికే భవన్లో నిర్వహించడం జరుగుతుందన్నారు.