తెలంగాణ

telangana

By

Published : Sep 19, 2019, 7:47 PM IST

ETV Bharat / state

కేసీఆర్​కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ...

తెలంగాణ యువజన కమిషన్​ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​ రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని విమర్శించారు. ప్రభుత్వ తప్పుడు విధానాలు, మోసపూరిత వైఖరిని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆక్షేపించారు.

రేవంత్​ రెడ్డి

'రాష్ట్ర యువజన కమిషన్​ ఏర్పాటు చేయండి'

తెలంగాణ ఉద్యమ చరిత్ర చూస్తే అడుగడుగునా యువత పోరాటాలు, త్యాగాలే కనిపిస్తాయని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​ రెడ్డి అన్నారు. పోలీసు తూటాలు-లాఠీలకు ఎదురొడ్డి స్వరాష్ట్ర సాధనలో వారు చూపిన తెగువ ఎప్పటికీ మరపురానిదని, మరువలేనిదన్నారు. వందల ప్రాణాలు, లక్షలాది యువత త్యాగాలతో స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన విషయం కాదనలేని నిజమని చెప్పారు. కానీ కేసీఆర్ ఐదున్నర ఏళ్ల పాలనలో యువతను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో యువత సమస్యల పరిష్కారానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వేదిక అవసరమని రేవంత్ అభిప్రాయపడ్డారు. అందుకే రాష్ట్ర యువజన కమిషన్​ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు.

లేఖ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details