తెలంగాణ

telangana

ETV Bharat / state

REVANTH: కర్ణాటక కాంగ్రెస్ నేతలను కలిసిన రేవంత్​రెడ్డి.. అందుకోసమేనా! - revanth reddy latest news

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి కర్ణాటక కాంగ్రెస్​ నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 7న తన పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, మాజీ హోంమంత్రి ఎంబీ పాటిల్, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్​లను ఆహ్వానించారు.

కర్ణాటక కాంగ్రెస్ నేతలను కలిసిన రేవంత్​రెడ్డి
కర్ణాటక కాంగ్రెస్ నేతలను కలిసిన రేవంత్​రెడ్డి

By

Published : Jul 5, 2021, 3:23 PM IST

Updated : Jul 5, 2021, 3:46 PM IST

మలికార్జున్​ ఖర్గేతో రేవంత్​..

టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్​రెడ్డి కర్ణాటక కాంగ్రెస్​ నేతలను కలిశారు. బెంగళూరులో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి ఎంబీ పాటిల్, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్​లతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమను కలిసేందుకు వచ్చిన రేవంత్​రెడ్డికి నేతలు శాలువా కప్పి సత్కరించారు.

డీకే శివకుమార్​తో రేవంత్​రెడ్డి

ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను వారికి వివరించారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా నేతలను ఆహ్వానించారు. అంతకుముందు బెంగళూరులో కాంగ్రెస్​ శ్రేణులు రేవంత్​రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి.. శుభాకాంక్షలు తెలిపారు.

రేవంత్​రెడ్డికి ఘన స్వాగతం

సిద్ధరామయ్య, మల్లికార్జున్​ ఖర్గేలు కర్ణాటక రాష్ట్రం నుంచి దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. డీకే శివకుమార్​ నాకు చాలా సన్నిహితమైన వ్యక్తి. ఈ నెల 7న నేను పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నా. పదవి చేపట్టే ముందు శివకుమార్​ నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నా. భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకురావడానికి కార్యాచరణపై చర్చించాం. నేను పదవీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి కర్ణాటక నేతలను ఆహ్వానించేందుకు బెంగళూరుకు వచ్చాను. -రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

కర్ణాటక కాంగ్రెస్ నేతలను కలిసిన రేవంత్​రెడ్డి.. అందుకోసమేనా!

1:30 గంటలకు బాధ్యతలు..

ఈ నెల ఏడో తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం గాంధీభవన్​లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైకమాండ్ తన పేరును ప్రకటించినప్పటి నుంచి రేవంత్ రెడ్డి.. పార్టీ సీనియర్ నేతలను వరుసగా కలుస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం నిరుద్యోగ సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తానని రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. రైతులకు సంబంధించి తమ వద్ద అద్భుతమైన ప్రణాళిక ఉందని, పార్టీ ఆమోదం తర్వాత దానిని వెల్లడిస్తానని స్పష్టం చేశారు.

సిద్ధరామయ్యతో రేవంత్​రెడ్డి మర్యాదపూర్వక భేటీ

ఇదీ చూడండి: Minister Sabitha: మంత్రి సబిత నివాసాన్ని ముట్టడించిన విద్యార్థులు

Last Updated : Jul 5, 2021, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details