తెలంగాణ

telangana

ETV Bharat / state

నాంపల్లి కోర్టుకు.. రేవంత్​ రెడ్డి సహా పలువురు నేతలు

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్​ రెడ్డి సహా.. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో వివిధ కేసులు నమోదైన కేసుల్లో వారంతా సోమవారం కోర్టుకు హాజరయ్యారు.

By

Published : Oct 12, 2020, 1:41 PM IST

Revanth Reddy And Some Leaders Attends Nampally Court
నాంపల్లి కోర్టుకు.. రేవంత్​ రెడ్డి సహా పలువురు నేతలు

ఎన్నికల సమయంలో వివిధ కేసులు నమోదైన పలు రాజకీయ పార్టీల నాయకులు హైదరాబాద్​లోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. గడువు ముగిసిన తర్వాత ప్రచారం చేయడం, రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహించిన సందర్భాల్లో నమోదైన కేసుల్లో కోర్టు ముందు హాజరయ్యారు.

న్యాయమూర్తి ముందు హాజరైన వారిలో.. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్​ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, తెరాస మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్య​లు కోర్టుకు వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details