గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లోకేశ్కుమార్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు - Republic Day celebrations
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. కమిషనర్ లోకేశ్కుమార్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
![జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10385322-319-10385322-1611645053853.jpg)
జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
జాతీయ జెండా ఆవిష్కరణకు ముందు పోలీసు గౌరవ వందనాన్ని కమిషనర్ స్వీకరించారు. కరోనా నిబంధనలతో జరిగిన ఈ గణతంత్ర వేడుకలు కొత్తపాలక మండలికి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో ఏ విధమైన సందేశాలు లేకుండానే ముగిశాయి.