తెలంగాణ

telangana

మేయర్​ విజయలక్ష్మీ నివాసంలో తెరాస సభ్యత్వాల నమోదు

బంజారాహిల్స్​లోని మేయర్​ గద్వాల విజయలక్ష్మీ నివాసంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్​ నేత కేకే, ఎమ్మెల్యే దానం నాగేందర్​ పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని.. కేకే, మేయర్​ హామీ ఇచ్చారు. అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

By

Published : Feb 15, 2021, 4:36 PM IST

Published : Feb 15, 2021, 4:36 PM IST

mayor vijayalakshmi, kk, danam nagender
తెరాస సభ్యత్వాల నమోదు

తెరాస కార్యకర్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీనియర్​ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు హామీ ఇచ్చారు. సభ్యత్వం పొందిన కార్యకర్తల కోసం రూ. 2 కోట్ల 50 లక్షల విలువైన బీమా చేసినట్లు కేకే వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని మేయర్ గద్వాల విజయలక్ష్మీ నివాసంలో కేకే ఆధ్వర్యంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.

మేయర్​ హామీ

ఖైరతాబాద్ డివిజన్‌ అభివృద్ధికి కృషి చేస్తామని మేయర్ గద్వాల విజయలక్ష్మీ హామీ ఇచ్చారు. కార్యకర్తలకు ఏ సమస్య ఎదురైనా పరిష్కరించేందుకు ముందుంటామని పేర్కొన్నారు. తనకు మేయర్ పదవి కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు.

నియోజకవర్గంలో అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. కేసీఆర్​తోనే నగరాభివృద్ధి సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కార్యకర్తలకు ఆరోగ్య బీమా: కేకే

ఇదీ చదవండి:ఈనెల 20న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అభిమానులతో షర్మిల భేటీ

ABOUT THE AUTHOR

...view details