హైదరాబాద్ వాసుల చిరకాల వాంఛ... రీజనల్ రింగ్రోడ్డు సాకారం కాబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రింగురోడ్డు అంశంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశామన్న కిషన్ రెడ్డి... నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
రీజనల్ రింగ్రోడ్డు కల సాకారం కాబోతుంది: కిషన్రెడ్డి - Telangana news
రీజినల్ రింగ్ రోడ్డు అంశంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసినట్లు కిషన్రెడ్డి పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేశారు.

రీజనల్ రింగ్రోడ్డు కల సాకారం కాబోతుంది: కిషన్రెడ్డి
సుమారు రూ.17వేల కోట్లతో కేంద్రం రీజనల్ రింగ్రోడ్డు నిర్మించబోతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు 20 పట్టణాలకు రింగురోడ్డు ఉపయుక్తం కానుందన్నారు. నూతన పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధితో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రీజనల్ రింగ్రోడ్డు కల సాకారం కాబోతుంది: కిషన్రెడ్డి
ఇదీ చూడండి: నెలాఖరు నాటికి సభ్యత్వ నమోదు పూర్తిచేయాలి: కేటీఆర్