కరోనా వ్యాప్తి నేపథ్యంలో పట్టణాల్లో వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు మూతపడటం, నిర్మాణరంగం కుదేలవడం, చిన్న వ్యాపారాలూ సాగకపోవడంతో వాటిపై ఆధారపడిన ప్రజలంతా గ్రామాల బాట పట్టారు.
సొంత ఊళ్ళకు చేరుకున్న వారిలో ఎక్కువ మంది బతుకుదెరువు కోసం ఉపాధిహామీ పనుల వైపు మొగ్గు చూపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ అంటే నాలుగు నెలల్లోనే కొత్తగా 2,47,440 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
జులై నెలాఖరు నాటికి 12.56 కోట్ల పనిదినాలు లక్ష్యంగా పెట్టుకోగా ప్రస్తుతానికి 9.55 కోట్ల పనిదినాలను పూర్తిచేశారు. అంటే నిర్దేశిత లక్ష్యంలో 76.01 శాతం సాధించినట్లయింది. సంబంధిత అధికారులు దీన్ని ఒక రికార్డుగా పేర్కొంటున్నారు. నిరుడు ఇదే సమయానికి నిర్దేశిత లక్ష్యంలో 27.36 శాతం పనిదినాలే పూర్తిచేయగలిగారు.
ఉన్నత విద్యావంతులు సైతం..