తెలంగాణ

telangana

ETV Bharat / state

రాయపాటిపై కన్నా పరువు నష్టం దావా.. 12 ఏళ్ల తర్వాత కోర్టులో రాజీ

Reconciliation between Rayapati and Kanna: ఏపీకి చెందిన సీనియర్ నేతలు రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణల వివాదంపై న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపింది. ఇద్దరు నేతలు రాజీకి వచ్చినట్లు న్యాయమూర్తి ఎదుట తెలిపారు. దీంతో 12 ఏళ్ల క్రితం నమోదైన కేసు పరిష్కారమైంది.

By

Published : Nov 1, 2022, 8:49 PM IST

రాయపాటిపై కన్నా పరువు నష్టం దావా.. 12 ఏళ్ల తర్వాత కోర్టులో రాజీ
రాయపాటిపై కన్నా పరువు నష్టం దావా.. 12 ఏళ్ల తర్వాత కోర్టులో రాజీ

Reconciliation between Rayapati and Kanna: ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరుకు చెందిన సీనియర్ నేతలు రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణల వివాదంపై కోర్టులో విచారణ జరిగింది. 2010లో రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై.. కన్నా లక్ష్మీనారాయణ పరువు నష్టం దావా వేశారు. దీనిపై ఈ రోజు విచారణలో భాగంగా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు కోర్టులో రాయపాటి, కన్నాలు తెలిపారు. న్యాయమూర్తి సమక్షంలో రాయపాటి, కన్నా రాజీకి వచ్చామని చెప్పారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని.. కోర్టు వారి మధ్య సయోధ్య కుదిర్చినట్లుగా వారి తరఫు న్యాయవాదులు తెలిపారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదిరింది.

ABOUT THE AUTHOR

...view details