తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి వద్ద వశిష్ఠ గోదావరిలో ఒంటి నిండా చారలతో ఉన్న చేప... మత్స్యకారుడు చింతా లక్ష్మణ్ వలకు బుధవారం చిక్కింది.
ఏపీలో గంగపుత్రుడి వలకు చిక్కిన అరుదైన చేప - సఖినేటిపల్లిలో అరుదైన చేప లభ్యం
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి వశిష్ట గోదావరి నదిలో మత్స్యకారులకు అరుదైన చేప లభ్యమైంది. ఒంటినిండా చారలు ఉన్న ఆ చేపను చూసి గంగపుత్రులు ఆశ్చర్యపోయారు.
ఏపీలో గంగపుత్రుడి వలకు చిక్కిన అరుదైన చేప
ఈ రకం చేపను చూడటం ఇదే మొదటిసారని మత్స్యకారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైపోస్టోమస్ ప్లేకోస్టోమస్ జాతికి చెందిన ఈ మత్స్యాన్ని సక్కర్ క్యాట్ ఫిష్గా పిలుస్తారని రాజోలు మత్స్య శాఖ ఏడీ కృష్ణారావు నిర్థారించారు.
ఇవీ చూడండి : నిమ్స్లో కొనసాగుతున్న కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్