తెలంగాణ

telangana

ఏపీలో గంగపుత్రుడి వలకు చిక్కిన అరుదైన చేప

By

Published : Jul 23, 2020, 2:08 PM IST

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి వశిష్ట గోదావరి నదిలో మత్స్యకారులకు అరుదైన చేప లభ్యమైంది. ఒంటినిండా చారలు ఉన్న ఆ చేపను చూసి గంగపుత్రులు ఆశ్చర్యపోయారు.

ఏపీలో గంగపుత్రుడి వలకు చిక్కిన అరుదైన చేప
ఏపీలో గంగపుత్రుడి వలకు చిక్కిన అరుదైన చేప

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి వద్ద వశిష్ఠ గోదావరిలో ఒంటి నిండా చారలతో ఉన్న చేప... మత్స్యకారుడు చింతా లక్ష్మణ్‌ వలకు బుధవారం చిక్కింది.

ఈ రకం చేపను చూడటం ఇదే మొదటిసారని మత్స్యకారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైపోస్టోమస్‌ ప్లేకోస్టోమస్‌ జాతికి చెందిన ఈ మత్స్యాన్ని సక్కర్‌ క్యాట్‌ ఫిష్‌గా పిలుస్తారని రాజోలు మత్స్య శాఖ ఏడీ కృష్ణారావు నిర్థారించారు.

ఇవీ చూడండి : నిమ్స్‌లో కొనసాగుతున్న కొవాగ్జిన్ క్లినికల్‌ ట్రయల్స్‌

ABOUT THE AUTHOR

...view details