తెలంగాణ

telangana

ETV Bharat / state

నగరంలో రంగవల్లుల పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు - రంగవల్లుల పోటీలు తాజా వార్త

నగరంలో సంక్రాంతి సంబురాలు ఊపందుకున్నాయి. ఒకవైపు పతంగులు ఎగురవేస్తూ.. మరో వైపు ముగ్గులు వేస్తూ ప్రజల ఆనందిస్తున్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని మహిళలకు పలు స్వచ్ఛంద సంస్థలు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తూ బహుమతులను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో మహిళలు చిన్నా పెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

rangoli competitions in Hyderabad
నగరంలో రంగవల్లుల పోటీలు.. ఉత్సాహంగా పాల్గొంటున్న మహిళలు

By

Published : Jan 11, 2020, 1:42 PM IST

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో, సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లకుంటలోని పాత రామాలయం వద్ద ముగ్గుల పోటీలు జరిగాయి. ముషీరాబాద్​విద్యానగర్​లోని ఓ అపార్ట్​మెంట్​లో నిర్వహించిన రంగోళి పోటీలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ఆయన సతీమణి ఉమా లక్ష్మణ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సంక్రాంతి పండుగ అంటేనే ముత్యాల ముగ్గులు గుర్తొస్తాయని ఈ రంగవల్లులను తీర్చిదిద్దడంలో మహిళలు ఎంతో సంతోషిస్తారని ఉమాలక్ష్మణ్​ తెలిపారు. ముగ్గుల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు.

నల్లకుంటలోని రామాలయం వద్ద జరిగిన ముగ్గుల పోటీ న్యాయ నిర్ణేతగా ఫీవర్​ ఆస్పత్రి ప్రొఫెసర్​ డాక్టర్.​సుధారాణి హాజరై బహుమతులను అందించారు.

నగరంలో రంగవల్లుల పోటీలు.. ఉత్సాహంగా పాల్గొంటున్న మహిళలు

ఇదీ చూడండి: సీఏఏ​, ఎన్​ఆర్సీలను స్వాగతిస్తూ... యువతుల ముగ్గులు

ABOUT THE AUTHOR

...view details