తెలంగాణ

telangana

By

Published : May 14, 2021, 8:51 PM IST

ETV Bharat / state

ముషీరాబాద్​లో నిరాడంబరంగా రంజాన్​ వేడుకలు

ముషీరాబాద్ నియోజకవర్గంలో రంజాన్​ వేడుకలను ముస్లింలు నిరాడంబరంగా జరుపుకున్నారు. కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో ఇళ్లలోనే ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు.

ramjan in telangana
తెలంగాణ వార్తలు

ముషీరాబాద్ నియోజకవర్గంలో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు నిరాడంబరంగా చేసుకున్నారు. నియోజకవర్గంలోని రామ్ నగర్, ముషీరాబాద్, భోలక్ పూర్, అడిక్​మెట్, గాంధీనగర్, కవాడిగూడ డివిజన్లలో... రంజాన్​ వేడుకలు జరుపుకున్నారు. కొవిడ్​ వ్యాప్తి కారణంగా ఇళ్లలోనే ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు.

కుల మతాలకతీతంగా పండుగలు చేసుకోవడం భాగ్యనగర్​ వాసులకు ఆనవాయితీగా మారిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రంజాన్​ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు ముఠా జై సింహ, మహమ్మద్ అలీ, వై శ్రీనివాస్, షరీఫ్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్​లు అడ్డుకోవద్దు: జగ్గారెడ్డి

ABOUT THE AUTHOR

...view details